Friday, May 3, 2024

జనసేన నేతలతో భేటీ కానున్న పవన్.. చర్చించే అంశాలు ఏంటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ పాలిటిక్స్ లో బీజీ అవుతున్నారు. బుధవారం విజయవాడలో పవన్ కల్యాణ్​ పర్యటించనున్నారు. ఈ నెల 7న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్న పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్న సమాచారం.

కాగా, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ తరుపున ప్రచారం చేసిన పవన్.. అనంతరం సినిమాలతో బీజీ అయ్యారు. అయితే, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగడం, వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఫై విపక్షాలు, యువత నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement