Saturday, April 27, 2024

స్టూడెంట్స్ లేరని.. రూ.23లక్షల జీతం వెనక్కి ఇచ్చిన ప్రొ. లాలన్ కుమార్

స్టూడెంట్స్ లేరని.. అందువల్ల తాను జీతం తీసుకోవద్దని నిర్ణయించుకున్నాడు.. తీసుకున్న జీతాన్ని వెనక్కి ఇచ్చేశాడు ప్రొ.లాలన్ కుమార్. బిహార్ లోని నితీశేశ్వర్ కాలేజీ ప్రొఫెసర్ లాలన్ కుమార్ స్టూడెంట్స్ లేరని తన 33నెలల జీతం వెనక్కి ఇచ్చేశాడు. తరగతులకు విద్యార్థులు హాజరుకావడం లేదన్న కారణంతో రూ.23లక్షలు వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. ‘బోధించకుండా జీతం తీసుకోవడానికి నా మనస్సాక్షి అనుమతించడం లేదు. కరోనా సమయంలోనూ ఆన్లైన్ తరగతులకు కొద్దిమంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. బోధించకుండా జీతం తీసుకుంటే అది నాకు విద్యా మరణమే’ అని లాలన్ అంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement