Saturday, April 20, 2024

15న థియేట‌ర్ లో రిలీజ్ కానున్న‌ డియర్‌ భూతం..

నటుడిగా ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభుదేవా మార్క్‌ కనిపించింది. ఈ క్రమంలోనే ప్రభుదేవా ముఖ్యపాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్‌ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్‌ అండ్‌ అవుట్‌ కిడ్స్‌ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా క్యారెక్టర్‌ తో పాటు అడ్వెంచర్‌ సీన్స్‌, గ్రాఫిక్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయట రమేష్‌ పి పిళ్ళై నిర్మిస్తున్నారు.

ఎన్‌. రాఘవన్‌ దర్శకుడు. ఏఎన్‌ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. అయితే షూటింగ్‌ కంప్లీట్‌ కావడంతో ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. జూలై15వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement