Thursday, May 16, 2024

రూ.900ల కోసం తండ్రినే చంపిన కిరాత‌కుడు

900 రూపాయ‌ల కోసం ఓ కిరాత‌క కుమారుడు తండ్రినే చంపేశాడు. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కొడుకే తండ్రిని కడతేర్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా జవహర్​లో జరిగింది. పాల్ఘర్ జిల్లా జవహర్ ప్రాంతానికి చెందిన జాను మాలి.. పించన్ డబ్బులు రూ. 900 తన బ్యాంక్ ఖాతాలో నుంచి తీశారు. ఆ డబ్బులను కుమారుడు రవీంద్ర మాలి అడుగగా ఇచ్చేందుకు నిరాకరించారు.

దీంతో ఆగ్రహించిన రవీంద్ర మాలి (35) తన తండ్రిని చితకబాదాడు. బాధితుడిని వెంటనే కుటుంబసభ్యులు మొఖాడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు పరిస్థితి చేజారిపోయిందని, నాసిక్​కు తీసుకెళ్లాలని సూచించారు. నిందితుడు రవీంద్ర మాలి తన తండ్రిని నాసిక్​కు తరలించకుండా ఇంటికి తీసుకెళ్లిపోయాడు. మరుసటి రోజే జాను మాలి చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించి, నిందితుడు రవీంద్ర మాలిని అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement