Sunday, May 12, 2024

మ‌హిళా కూలీని కిడ్నాప్ చేసి.. ఆ ప‌నికి పాల్ప‌డిన మేస్త్రీ

క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్‌గా ప‌నిచేసే 32 ఏండ్ల ఓ మ‌హిళ‌ను కిడ్నాప్ చేసి ఆ ప‌నికి పాల్ప‌డిన మేస్త్రీతో పాటు అత‌డికి స‌హ‌కరించిన మ‌రో కూలీని భోపాల్‌లోని బిల్ఖిరియా పోలీసులు అరెస్ట్ చేశారు. తాపీ మేస్త్రీతో పాటు త‌న‌తో ప‌నిచేసే కూలీ త‌న‌ను కిడ్నాప్ చేసి ఓ దాబాలో లైంగికదాడికి పాల్ప‌డ్డార‌ని బాధితురాలు పోలీసుల‌కు కంప్లెయింట్ చేసింది. భ‌ర్త‌తో క‌లిసి బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగుచూసింది. మొన్న సాయంత్రం తాను ప‌ని ముగించుకుని ఇంటికి వ‌స్తుండ‌గా నిందితుడు స్కూట‌ర్‌పై త‌న‌కు లిఫ్ట్ ఇస్తాన‌ని ఎక్కించుకున్నాడ‌ని, అయితే నిందితులు త‌న‌ను బిల్ఖిరియాలోని దాబాకు తీసుకువెళ్లార‌ని ఓ వ్య‌క్తి బ‌య‌ట కాప‌లాగా ఉండ‌గా మేస్త్రీ త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఆ మ‌హిళ పేర్కొంది.

ఈ విష‌యం బ‌య‌ట ఎవ‌రికైనా చెబితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని బెదిరించాడ‌ని పోలీసుల‌కు తెలిపింది. లైంగిక దాడికి పాల్ప‌డిన అనంత‌రం నిందితులు బాధితురాల‌ని రాత్రి 8 గంట‌ల ప్రాంతంలో ఆమె ఇంటి వ‌ద్ద విడిచివెళ్లారు. ఈ విష‌యాన్నంతా త‌న భ‌ర్త‌కు చెప్ప‌డంతో ఇద్ద‌రూ క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్ప‌డిన మేస్త్రీతో పాటు అత‌డికి స‌హ‌క‌రించిన వ్య‌క్తిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement