Sunday, April 28, 2024

గుంటూరు పల్లి ఉపసర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం : ఆర్డీవో కు ఫిర్యాదు

చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పాలేపు రాంబాబు పై గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఐదుగురు గురువారం భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్ కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఉపసర్పంచ్ రాంబాబు గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనుల్లో సహకరించడం లేదని గ్రామ వార్డు సభ్యులు శ్రీలత, వెంకయమ్మ శ్రీనివాస రావు, భారతి, కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మాన పత్రం అందజేశారు. దీంతో ఆర్డీవో త్వరలో అవిశ్వాస తీర్మానానికి ఒక తేదీ నిర్ణయించి తెలియజేస్తామని తెలిపారని వారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement