Sunday, May 12, 2024

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి ముంబయి,ఢిల్లీ నగరాలకు చేరుకుంటున్న తెలంగాణా విద్యార్థులను అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం శనివారం రాత్రి ముంబై చేరుకుంది , మరో విమానం ఆదివారం తెల్లవారు జామున న్యూ ఢిల్లీకి చేరుకుందని సోమేశ్ కుమార్ తెలిపారు.విద్యార్థులను ముంబయి, హైదరాబాద్ కు చేరవేయడానికి ప్రభుత్వం ఉచితంగా టికెట్లను అందించడానికి ఏర్పాట్లను చేసిందని తెలిపారు.

ఈ విద్యార్థులు ప్రత్యేక విమానాల ద్వారా ఆదివారం ఉదయం బయలుదేరి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారని వివరించారు. ఉక్రెయిన్ నుండి వచ్చే విద్యార్థినీ విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని వివరించారు. ఇప్పటికే న్యూ ఢిల్లీ తెలంగాణ భవన్, హైదరాబాద్ లోని సెక్రెటేరియేట్ లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని సి.ఎస్. గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement