Tuesday, May 14, 2024

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టివేత

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కేంద్రంలోని సీత నగర్ లో పొగాకు ఉత్పత్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిషేదిత పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉంచి అమ్ముతున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,సిబ్బంది శ్రీనివాస్,మహేందర్,ప్రకాష్ మల్లేష్ తో కలిసి సీత నగర్ లోని ఉయ్యాం శ్రీనివాస్ ఇంట్లో తనిఖీ నిర్వహించగా 44,750 రూపాయల విలువ గల నిషేదిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకొన్నారు. షాప్ యజమాని అయిన ఉయ్యాం శ్రీనివాస్ ని అదుపు లోనికి తీసుకుని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement