Sunday, April 28, 2024

ఏపీ సర్కార్ పై నాగబాబు ఆగ్రహం.. పవన్ ని టార్గెట్ చేశారంటూ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిపై నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమను, పవన్‌కల్యాణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని మండిపడ్డారు. వకీల్‌సాబ్‌ నుంచి భీమ్లానాయక్‌ సినిమా దాకా పవన్‌పై కక్ష కట్టిందని విరుచుకుపడ్డారు. సినిమా టికెట్‌ ధరలపై జీవో విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. జీవో విడుదల విషయంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. పవన్‌పై పగపట్టి ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదని నాగబాబు ఆగ్రహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement