Sunday, May 19, 2024

BREAKING: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఎంవో కార్యాలయం ఓ ప్రెస్‌నోట్ ద్వారా ప్రకటించింది. కేసీఆర్‌కు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే ఆయన ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రెస్‌నోట్‌లో ఉంది. యాంటీజెన్ టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సీఎస్ సోమేష్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సీఎస్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement