Thursday, May 16, 2024

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయంలో తొలిసారి కేబినెట్ సమావేశం జరగనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై, మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా అమరవీరుల స్మృతివనం ప్రారంభించే తేదీని ఖరారు చేయనున్నారు. అలాగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై కూడా కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement