Sunday, April 28, 2024

కేంద్ర‌న్యాయ‌శాఖ మంత్రిగా.. కిర‌ణ్ రిజిజు తొల‌గింపు

కేంద్ర‌న్యాయ‌శాఖ మంత్రిగా కిర‌ణ్ రిజిజుని తొల‌గించి.. భూవిజ్ఞాన శాస్త్ర‌శాఖ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది మోడీ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు కేంద్ర కేబినెట్ లో మార్పులు చేశారు.కాగా కిరణ్ రిజిజు స్థానంలో అరుణ్ రామ్ మేఘ్వాల్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో ఇది పెద్ద పునర్వ్యవస్థీకరణ. కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. న్యాయమంత్రి తీరుపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం ద్వారా న్యాయమూర్తులను ఎన్నుకోకూడదని కిరణ్ రిజిజు పదే పదే చెప్పారు. న్యాయమూర్తుల నియామకానికి ఇంతకంటే మంచి మార్గం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాలా దేశాల్లో ఇదే పద్ధతి అవలంబిస్తున్నదని సుప్రీంకోర్టు కూడా అప్పట్లో చెప్పింది. సౌరభ్ కృపాల్ కేసు తెరపైకి రావడంతో తొలిసారి ఇద్దరి మధ్య టెన్షన్ బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. సౌరభ్ కృపాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. కానీ న్యాయ మంత్రిత్వ శాఖ అతని ఫైల్‌ను ఆమోదించలేదు.ఒక్కసారిగా ఈ మార్పులకు కారణం ఇంక తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement