Wednesday, March 27, 2024

నారా లోకేష్ కుడి భుజానికి గాయం..

నంద్యాల : టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. అయితే 50 రోజులుగా కుడి భుజం నొప్పితో లోకేష్ బాధపడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయ‌మైంది. అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. ఎంత‌కీ నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచించారు. దీంతో నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో లోకేష్ కుడి భుజానికి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement