Sunday, May 12, 2024

సభలో ఎవరు… ఏం మాట్లాడారు?

మంత్రి జగదీష్‌రెడ్డి

  • తెలంగాణలో కరెంట్ ఛార్జీలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు
  • ఒకవేళ ఛార్జీలు పెంచాల్సి వస్తే తప్పక ప్రజలకు ముందుగా చెప్తాం

మంత్రి కేటీఆర్

  • తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రాధాన్యత ఇస్తోంది
  • ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నం చేస్తోంది
  • 912 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్స్ ఉన్నాయి
  • పర్యావరణ వ్యవస్థను పరిరక్షించేందుకు ఎలక్ట్రానిక్స్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది
  • ఎలక్ట్రానిక్స్ ప్రోత్సాహకాల కోసం స్టీరింగ్ కమిటీ నియామకం చేసింది
  • 70వేల కోట్ల పెట్టుబడుల టార్గెట్- 4లక్షల ఉద్యోగాల లక్ష్యంగా పెట్టుకున్నాం
  • హౌసింగ్ బోర్డ్ లో ఇల్లు కట్టుకోవడానికి పరిశీలిన ప్రభుత్వం చేస్తుంది
  • గ్రామ కంఠం భూముల విషయంలో అధికారులతో మాట్లాడతాం
  • టౌన్ ప్లానింగ్ విషయంలో 200 పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తున్నాం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్

  • మా జిల్లాలో 8వేల రేషన్ కార్డ్ దరఖాస్తులు ఉన్నాయి
  • 15వేల రేషన్ కార్డులను అధికారులు తొలగించారు
  • మా జిల్లాకు తొలగించిన రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఇవ్వాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్

  • గత ఏడాది ఓవర్సీస్ బడ్జెట్ ఈ సారి కూడా ఉపయోగించాలి
  • నిధులు విడుదల చేయకపోవడంతో ఓవర్సీస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి
  • మంచి పథకం కాబట్టి గ్రౌండ్ లెవల్‌లో సరిగ్గా అమలు చేయాలి

ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్

- Advertisement -
  • ప్రతి ఏటా 5వందల మందికి స్కాలర్ షిప్ ఇవ్వాలి
  • 2019-20లో 240 మందికి మాత్రమే ఇచ్చారు.
  • 5వందల మంది నుంచి 240కి తగ్గించడానికి ప్రభుత్వం కారణం చెప్పలేదు
  • ప్రభుత్వానికి దరఖాస్తులు రావడం లేదా? దరఖాస్తులు వచ్చినా ప్రభుత్వం ఇవ్వడం లేదా?
  • విదేశాలకు వెళ్లిన స్టూడెంట్స్ కి నిధులు పెండింగ్ ఉన్నాయి. 2017నుంచి పెండింగ్ పెట్టారు
  • విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులు విడుదల చేయాలి.

మంత్రి కొప్పుల ఈశ్వర్

  • విదేశీ విద్యకు వెళ్లే వారి ఆదాయం 10లక్షలకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది
  • విదేశీ విద్యకు ముఖ్యమైన పది దేశాలు ఇప్పుడు ఉన్నాయి.. మరిన్ని చేర్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది
  • ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల ఎంపిక పారదర్శకంగా జరుపుతోంది
  • గ్రామీణ ప్రాంతాల్లో నుంచే వెళ్లారు.. అమెరికా- ఆస్ట్రేలియా లాంటి దేశాలకు ఎక్కువగా వెళ్లారు
  • కరోనా వల్ల గత ఏడాది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది వాస్తవమే
  • బీసీ విద్యార్థుల కంటే మైనార్టీ విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్ షిప్‌ను ఉపయోగించుకున్నారు.

మంత్రి గంగుల కమలాకర్

  • రేషన్ కార్డుల విషయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టింది
  • 53లక్షల 46వేలకు మాత్రమే మీరు అర్హులు అని చెప్పింది
  • 1 కోటి 91లక్షల లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం చెప్పింది
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1కోటి 79లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు
  • 2 కోట్ల 79 లక్షల రేషన్ కార్డ్ ప్రస్తుతం ఉన్నాయి
  • తెలంగాణలో ఉన్న జనాభాలో 80శాతం మందికి రేషన్ కార్డ్ ఉంది
  • రేషన్ కార్డ్ నిరంతర ప్రక్రియ..కొనసాగుతూనే ఉంటుంది
  • తెలంగాణ రాష్ట్రం వచ్చాక…2019లో 3లక్షల 59వేల కొత్త కార్డులు ఇచ్చాం
  • మెదక్ జిల్లాలో 7వేలకు పైగా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చాం
  • కరోనా వల్ల గత ఏడాది కార్డుల జారీ ఆలస్యం అయిపోయింది
  • సిద్దిపేటలో 10వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. 7వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి.. అవి నిజమైన అర్హులకు ఇస్తాం
  • గడిచిన మూడేళ్ళలో కొత్తగా 44వేల కార్డులు ఇచ్చాం
  • 97వేల కొత్త కార్డులు పెండింగులో ఉన్నాయి
  • కరోనా వల్ల కొత్త కార్డులు ఇవ్వలేక పోయాం.. పెండింగ్ దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలన చేస్తుంది
  • మూడు నెలలు వరుసగా బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డ్ తొలగిస్తారు

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

  • జూన్ 2014 నుంచి మెదక్‌లో ఎక్కడ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు
  • కొత్తగా 3లక్షల 59వేల రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు
  • 24వేల మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం సిద్దిపేటలో దరఖాస్తు చేసుకున్నారు
  • బడ్జెట్ గణాంకాలు చూస్తుంటే అప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి
  • మొత్తం దేశంలోనే కరోనా వ్యాక్సిన్ వెస్టేజ్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉండటం బాధేస్తోంది
  • తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌కు ఒక్క రూపాయి కేటాయించలేదు
  • ఇరిగేషన్ కేటాయించే బడ్జెట్ లో ఒక రూపాయిలో 47 పైసలు ఒకే ప్రాజెక్టుకు వెళ్తున్నాయి
  • దేశంతో పోల్చితే విద్యా రంగంలో తెలంగాణ వెనుకబడి పోయింది
  • పోలీస్ శాఖకు దేశం సగటుతో పోల్చితే తెలంగాణ తక్కువగా 4 శాతం ఉంది
  • కేటాయించిన అంకెలు గొప్పగా కనిపిస్తున్నాయి..అన్ని శాఖలకు అందేలా చుస్తే బాగుంటుంది
  • మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ తీసుకుని.. చెడు జరిగితే కేంద్రంపై వేయడం కరెక్ట్ కాదు
  • నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తగ్గించాలంటే నిరుద్యోగ భృతి ప్రకటించాలి.

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క

  • భారీ బడ్జెట్ లో ప్రాధాన్యత రంగానికి అనుకున్నంత కేటాయింపులు లేవు
  • విద్యా- వైద్య రంగానికి సర్కార్ మొండి చెయ్యి చూపించింది
  • కరోనా వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికి తెలుసు
  • వైద్యరంగానికి దేశ అవరేజ్ కంటే తక్కువగా కేటాయింపులు ఉన్నాయి
  • రోడ్లు, బ్రిడ్జిలకు దేశ యావరేజ్‌తో పోల్చితే చాలా తక్కువగా కేటాయించారు
  • వైద్య, విద్య, రూరల్ డెవలప్‌మెంట్, రోడ్లు, బ్రిడ్జిల శాఖలను ప్రభుత్వం తక్కువ చేసి చూస్తోంది
  • ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం.. ఉద్యోగాల కల్పనలో ఇప్పటి వరకు దేశంలో ప్రియార్టీ రాష్ట్రంగా ఉండాల్సి ఉండేది.. కానీ లేదు
  • కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతామని అంటుంది.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి
  • ప్రభుత్వ రంగ సంస్థలు క్లోజ్ అయితే వేల సంఖ్యలో రోడ్డున పడతారు
  • ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలి
  • ప్రభుత్వం తెస్తున్న అప్పులు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్

  • నా నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉంది
  • మంచిర్యాల జిల్లా జన్నారంలో చెరువు కబ్జా అయింది
  • సర్వే 400 ఉన్న చెరువు కబ్జా వల్ల రైతులకు అన్యాయం జరుగుతోంది
  • జన్నారంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి
  • జన్నారంలో డబుల్ బెడ్ రూమ్ కట్టడానికి భూములు లేవు
Advertisement

తాజా వార్తలు

Advertisement