Monday, April 29, 2024

ర‌జ‌నీకాంత్ కుమారై ‘ఐశ్వ‌ర్య‌’కి క‌రోనా

హాస్ప‌ట‌ల్ లో చేరారు త‌మిళ సూపర్ స్టార్ కుమారై , స్టార్ హీరో ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య‌. త‌న‌కు క‌రోనా పాజిటీవ్ గా నిర్ధార‌ణ అయింద‌ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. క‌రోనాతో ఆస్ప‌త్రి లో చేరాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ 2022 ఏడాదిలో తన జీవితంలో ఎలాంటి మార్పులు వ‌స్తాయో అనే అర్థం వ‌చ్చేలా ఓ కామెంట్ ను జోడించింది. ఐశ్వ‌ర్య షూటింగ్ కోసం ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చింది. ఇక్క‌డే ఐశ్వ‌ర్య‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని తెలుస్తుంది. ఇటీవ‌ల చాలా మంది సెల‌బ్రెటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. షూటింగ్ ల‌లో పాల్గొంటు.. క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement