Saturday, April 27, 2024

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం.. తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత రాజేంద్ర బాలాజీ అరెస్టయ్యారు. గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఆయనను కర్ణాటకలో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజేంద్ర బాలాజీ గత ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో పాడిపరిశ్రమ శాఖగా పనిచేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement