Saturday, May 4, 2024

పాకిస్థాన్‌పై తాలిబాన్ల‌ దాడి – ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

పాకిస్థాన్ పై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారు..మ‌రో 20మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాందహార్‌లోని ది స్పిన్ బోల్డక్ జిల్లాలో డ్యూరాండ్ లైన్‌లో తాలిబాన్ , పాకిస్తాన్ సైన్యం మధ్య యుద్ధం జరిగింది. ఇరు సేనల మధ్య జరిగిన తోపులాట, కాల్పుల్లో పలువురు గాయపడినట్లు స‌మాచారం. ఈ సంఘటనలో ఇప్పటివరకు 20 మంది పౌరులు గాయపడ్డారు మరియు ముగ్గురు మరణించారు. మరోవైపు, స్పిన్ బోల్డక్‌లోని డ్యూరాండ్ లైన్‌లో తాలిబన్లు, పాకిస్థాన్ ఆర్మీ మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.. స్పిన్ బోల్డక్ గేట్ వద్ద పాకిస్థాన్ సైన్యం ఆఫ్ఘన్ చిన్నారిని టార్గెట్ చేసిందని, ఆ తర్వాత ఆఫ్ఘన్ భద్రతా దళాలు పాకిస్థాన్ సైన్యంపై కాల్పులు జరిపాయని తెలుస్తోంది. అల్-బదర్ కార్ప్స్ నుండి ఆర్మీ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు గార్డులకు ప్రతిస్పందించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే, సెపినా బోల్డక్ సరిహద్దు ద్వారం వద్ద అధికారులు ఈ సంఘటనను ధృవీక‌రించ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement