Friday, May 17, 2024

Breaking : బీజాపూర్ లో ఎన్ కౌంట‌ర్ – ఇద్ద‌రు మహిళా మావోయిస్టులు మృతి

ఛ‌త్తీస్ గ‌ఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. మావోయిస్టులు,పోలీసుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతి చెందారు.బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలం నుంచి మహిళా నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలను కూడా జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ ఇద్దరు మహిళా మావోయిస్టులు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఆ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.ఈ ఘ‌ట‌న నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement