Saturday, May 4, 2024

Breaking : భగత్ సింగ్ తో పోల్చుకున్న కేజ్రీవాల్ – మండిప‌డిన గౌతమ్ గంభీర్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనకు సిగ్గుతో తలదించుకోవాలని బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. పంజాబ్‌లో వేర్పాటువాద ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, తనను తాను ప్రపంచంలోనే అత్యంత మధురమైన ఉగ్రవాదిగా అభివర్ణించారు. బ్రిటిష్ వారికి భగత్ సింగ్ అంటే భయమని కేజ్రీవాల్ అన్నారు. అందుకే వారిని తీవ్రవాదులుగా పిలిచారు. నేను భగత్‌సింగ్‌కి శిష్యుడిన‌ని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై గౌతం గంభీర్ స్పందిస్తూ.. ‘భగత్ సింగ్ తన శరీరాన్ని ముక్కలు చేశారు, కానీ తన దేశాన్ని ముక్కలు చేయడానికి అనుమతించలేదు! అధికారం కోసం ఆయన పేరును ఆశ్రయించడం సిగ్గుచేటన్నారు. మీడియా స‌మావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ తనను ప్రధాని నరేంద్ర మోడీ, పంజాబ్ సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అని అభివర్ణించినందుకు తనపై దాడి చేశారని అన్నారు. ఈ అవినీతిపరులంతా త‌న‌ని టెర్రరిస్టులని అంటున్నారని కేజ్రీవాల్ అన్నారు.ప్రపంచంలో ప్రజల కోసం పాఠశాలలు కట్టించి, ఆసుపత్రులు కట్టే, కరెంటు బిగించే మొదటి ఉగ్రవాదిని నేనే అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement