Saturday, May 18, 2024

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు మంత్రి బొత్స స‌వాల్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడు కింజ‌రాప్ అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌వాల్ విసిరారు. ఇళ్ల నిర్మ‌ణాల్లో లోపాల‌ను అచ్చెన్నాయుడు చూపించాల‌న్నారు. అచ్చెన్నాయుడు ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డికి వ‌స్తా అన్నారు. టీడీపీ దోచుకోవ‌డానికే షేర్ వాల్ టెక్నాల‌జీ తెచ్చార‌న్నారు. ఇప్పుడు విద్యుత్ య‌దావిధిగా ఇస్తున్నామన్నారు. విద్యుత్ స‌మ‌స్య‌ను చంద్ర‌బాబు భూత‌ద్ధంలో చూపిస్తున్నార‌న్నారు. వివేకా హ‌త్యపై వైసీపీనే సీబీఐ ఎంక్వ‌యిరీ వేసింద‌న్నారు. చెత్త‌పన్నుపై టీడీపీ దుష్ప్ర‌చారం స‌రికాద‌న్నారు. టిడ్కో ఇళ్ల‌పై టీడీపీది త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement