Sunday, April 28, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

నేడు స్టాక్ మార్కెట్స్ లాభాల‌తో ముగిశాయి. అదానీ పోర్ట్స్ , ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్, బ‌జాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు లాభాల‌ను ముందు ఉండి న‌డిపించాయి. కాగా నేటి ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 385 పాయింట్లు లాభపడి 57,315కి పెరిగింది. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకుని 17,072 వద్ద స్థిరపడింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.40%), ఐటీసీ (2.48%), బజాజ్ ఫైనాన్స్ (2.12%), ఇన్ఫోసిస్ (1.77%), ఎన్టీపీసీ (1.67%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. భారతి ఎయిర్ టెల్ (-0.93%), సన్ ఫార్మా (-0.80%), మారుతి (-0.57%), అల్ట్రాటక్ సిమెంట్ (-0.56%), ఏసియన్ పెయింట్స్ (-0.27%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement