Saturday, April 27, 2024

యూపీ రాష్ట్ర ఇన్ ఛార్జి ‘రాధామోహ‌న్ సింగ్’ కి క‌రోనా – క‌ల‌వ‌రంలో బిజెపి నేత‌లు

ప్ర‌పంచాన్ని చుట్టేస్తోంది క‌రోనా. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఇన్ ఛార్జి రాధా మోహ‌న్ సింగ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న హాజ‌రైన స‌మావేశంలో బిజెపి పార్టీ పెద్ద‌లంతా పాల్గొన‌డంతో ఇప్పుడు క‌ల క‌లం రేగింది. ఈ స‌మావేశంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్, యూపీ బిజెపి చీఫ్ స్వ‌తంత్ర‌దేవ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం రాధామోహ‌న్ సింగ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సిద్ధమవుతున్న తరుణంలో నిన్న రాత్రి పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. రాధా మోహన్ సింగ్, స్వతంత్ర దేవ్ సింగ్, ఆ పక్కనే ఆదిత్యనాథ్ కూర్చుని కార్యాచరణపై చర్చించారు, రాధా మోహన్ సింగ్ షేర్ చేసిన ఫోటోలను బట్టి ఆ విషయం వెల్లడవుతోంది. ఇదిలా ఉండగా నేడు స్వతంత్ర దేవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రి ,తదితరులు బిజెపి కోర్ క‌మిటీ సమావేశం కోసం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంత‌మందికి క‌రోనా వ్యాపించ‌నుందో తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement