Tuesday, April 16, 2024

తడి, పొడి చెత్త వాహనాలను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసినటువంటి నూతన చెత్త సేకరణ తడి చెత్త, పొడి చెత్త వాహనాలను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని వాహనాలు మున్సిపల్ కార్పొరేటర్ లకు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల‌ పోటీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ ఐ వెంకటేశ్వర్లు, ఇతర డివిజన్ కార్పొరేటర్లు, కాలనీవాసులు, మున్సిపల్ కార్మికులు, మీడియా మిత్రులు, పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement