Wednesday, May 8, 2024

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న భారతీయులు

ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఉక్రెయిన్ లోని భార‌తీయుల‌ను వెంట‌నే స్వ‌దేశానికి రావాల‌ని ఇటీవ‌ల భార‌త ప్ర‌భుత్వం ఆదేశించింది. ఇందుకోసం ప్ర‌త్యేక విమానాన్ని కూడా పంపించింది. దీంతో ఉక్రెయిన్ నుంచి 182 భార‌తీయులు స్వదేశానికి వచ్చారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి విద్యార్థులు స‌హా ప‌లువురు భార‌తీయులు చేరుకున్నారు.

మరోవైపు ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి ఉక్రెయిన్‌లోనే వేలాది మంది భార‌తీయులు ఉన్నారు. కాగా, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య, భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అనేక విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియాతో సహా ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement