Saturday, May 11, 2024

Breaking : స్కూల్ బస్సు, స్కూటర్ ఢీ – ఇద్ద‌రు మృతి

ప్రకాశం :సీఎస్ పురం మండలం కంభంపాడు గ్రామం.. ఆంజనేయ స్వామి ఆలయం కు వెళ్లే ఆర్చీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సీఎస్ పురం మండలం నుండి పామూరుకు చెందిన సెయింట్ మార్క్స్ ప్రవేటు పాఠశాల బస్సు, విద్యార్థులను పామూరు పట్టణానికి తీసుకొని వెళ్లుతోంది. కాగా కంభంపాడు దగ్గర ఓ పలుగురాయి ఫ్యాక్టరీ లో కావలి పట్టణానికి చెందిన భాస్కర్ రెడ్డి (40) సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. తన బంధువును పామూరు నుండి స్కూటర్ పై కంభం పాడు కు తీసుకొని వస్తుండగా.. ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును వేగంగా ఢీ కొట్టడంతో వారిద్ద‌రు అక్కడికక్కడే మృత్యు వాత పడ్డారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి సీఎస్ పురం, పామూరు పోలీసులు చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement