మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు. మొదట స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత నేరుగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి బయలు దేరారు. చెర్రీ వెంట జనసేన అభిమానులు, కార్యకర్తలు భారీగా పవన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు రామ్ చరణ్ , సురేఖ. జనసేన అధిపతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/image-126-1024x619.png)
అనంతరం బయటకు వచ్చి జనసేన అభిమానులు, కార్యకర్తలకు కలిసి అభివాదం చేశారు పవన్, రామ్ చరణ్. బాబాయ్, అబ్బాయ్ లను ఒకే ఫ్రేమ్లో చూడడంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. . జనసేన అభిమానులు కేకలు, అరుపులతో హోరెత్తించారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/image-127.png)
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కోరారు. చిరంజీవి వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్ ‘మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/image-128-1024x777.png)