Thursday, May 2, 2024

చ‌నిపోతూ… ఆరుగురికి అవ‌య‌వ‌దానం

మంగళగిరి: ఓ యువ‌కుడు తాను మ‌ర‌ణించినా.. ప‌దుగురిలో జీవించే ఉండాల‌ని త‌లంచాడు. అందుకు త‌గిన‌ట్టుగా త‌న అవ‌య‌వాల‌ను దానం చేశారు. మచిలీపట్నం ప‌ట్ట‌ణానికి చెందిన కోటేశ్వరరావు (27) ఇటీవ‌ల భీమడోలు లో వివాహానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న బ్రెయిన్ డెడ్ అయింది. దీనితో మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో చేర్పించారు. అక్క‌డి వైద్యులు కుటుంబ స‌భ్యుల తో మాట్లాడి అవ‌య‌వ‌దానికి ఒప్పించారు. జీవన్ దార్ ద్వారా నేత్రాలు, లివర్, కిడ్నీలు, లంగ్స్, గుండె ను సేకరించారు. కళ్ళను గుంటూరు అగర్వాల్ ఆసుపత్రి, ఒక కిడ్నీ ఎన్నారై, మరో కిడ్నీ ని రమేష్ ఆసుపత్రులకు లివర్ ను హైదరాబాద్ అపోలో, గుండె ను చెన్నై లోని ఎం జీఎం ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు ఎన్నారై వైద్యాధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement