Wednesday, May 8, 2024

Breaking: స్పీకర్ పోచారంకు రెండోసారి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి రెండవసారి కోవిడ్ పాజిటివ్ తేలింది. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్ లో చేరారు.

గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని స్పీకర్ పోచారం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement