Sunday, April 28, 2024

భారతిని బతికిస్తాననుకున్నా… సోనూ భావోద్వేగం!

కరోనాతో పోరాడుతున్న భారతి అనే యువతిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ తరలించడంలో నటుడు సోనూసూద్ సాయం చేసిన సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. సోనూసూద్‌ ఉద్వేగానికి లోనయ్యారు. కొవిడ్‌తో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడడానికి తాను ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరికీ విషాదమే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులపాటు ఆసుపత్రిలో ఆమె జీవితంతో పోరాటం చేసిందన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా హృదయం ముక్కలైంది అంటూ సోనూ ట్వీట్ చేశారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కు చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడింది. వైరస్‌ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 85 శాతం వరకూ దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ.. భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ నేత పుట్ట మధు అరెస్ట్!

Advertisement

తాజా వార్తలు

Advertisement