Tuesday, May 14, 2024

కరోనాతో కొడుకు.. దిగులుతో తల్లిదండ్రులు మృతి

కరోనాతో కుమారుడు మృతి చెందిన వార్త తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం (మే9) సాయంత్రం కన్న కొడుకు కరోనాతో చనిపోగా సోమవారం ఉదయం గుండెపోటుతో తల్లితండ్రులు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.

వివరాల్లోకి వెళితే.. వంపుగూడకు చెందిన పిసరి హరీష్ రెడ్డి(31)కి 25 రోజుల క్రితం కరోనా సోకింది. అయితే, ఆస్పత్రిలో హరీష్.. చికిత్స పొందుతూ ఆదివారం(మే 9) తుది శ్వాస విడిచాడు. దీంతో కుమారుడు మృతి వార్త తెలిసి ఉద్వేగానికి లోనయ్యారు. 24 గంటలు గడవకముందే హరీష్ రెడ్డి తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: లాక్ డౌన్ లోను మద్యం అమ్మకాలు..? జీవో తెచ్చే యోచనలో సర్కార్

Advertisement

తాజా వార్తలు

Advertisement