కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో రజనీకాంత్ రిస్క్ చేసి మరీ హైదరాబాద్లో అన్నాత్తె చిత్రం 35 రోజుల షూటింగ్ పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ ప్రత్యేక అనుమతితో షూటింగ్ జరిపారు అన్నాత్తె టీం. సోమవారం సాయంత్రంతో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో, మంగళవారం రజనీకాంత్ చెన్నై వెళ్లినట్టు తెలుస్తుంది. రజనీకాంత్కు సంబంధించిన అన్ని సన్నివేశాలను శివ షూట్ చేశాడట. ఇక నయనతారతో పాటు ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అయితే తెలంగాణ లాక్ డౌన్ అమలు కానుండటంతో మిగితా షూటింగ్ వాయిదాపడే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన రజనీకాంత్..
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement