Monday, April 29, 2024

క‌రోనా నుంచి కోలుకున్న చోటా రాజన్..

గ్యాంగ్‌స్ట‌ర్ ఛోటా రాజ‌న్ క‌రోనా నుంచి కోలుకున్నాడు. గ‌త నెల 22న క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న ఏప్రిల్ 24న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరాడు. అప్ప‌టి నుంచి ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నాడు. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డంతో వైద్యులు ఆయ‌న‌ను ద‌వాఖాన నుంచి డిశ్చార్జీ చేశారు. దీంతో పోలీసులు మ‌ళ్లీ తీహార్ జైలుకు త‌ర‌లించారు. కాగా, చోటా రాజన్ చనిపోయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కరోనా చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు మీడియాలో వార్తలు రావడంతో, పోలీసు వర్గాలు స్పష్టతనిచ్చాయి. పెద్ద సంఖ్యలో కేసులు ఎదుర్కొంటున్న చోటా రాజన్ ను 2015లో ఇండోనేషియాలో అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement