Wednesday, May 15, 2024

ఆటోలో శ్రియ : మ‌ల్లికార్జున థియేట‌ర్ వ‌ద్ద సంద‌డి

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం గ‌మ‌నం. ఈ చిత్రం నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని సుజ‌నారావు రూపొందించారు. ఈ చిత్రంలో ప్రియాంక జ‌వాల్క‌ర్ , నిత్యామీన‌న్, సుహాస్, ర‌విప్ర‌కాశ్, శివ కందుకూరి న‌టించారు. కాగా ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించారు. కలి ప్రొడక్షన్స్, క్రియా ఫిల్మ్ కార్ప్ బ్యానర్లపై రమేశ్ కురుటూరి, వెంకీ పుష్పదపు, వీఎస్ జ్ఞానశేఖర్ నిర్మించారు. దాంతో గ‌మ‌నం సినిమాని వీక్షించేందుకు ఆటోలో హైద‌రాబాద్ లోని మ‌ల్లికార్జున థియేట‌ర్ కి వెళ్ళింది శ్రియా. ఈ థియేట‌ర్ కూక‌ట్ ప‌ల్లిలో ఉంది. ఆటోలో వ‌చ్చిన శ్రియ‌ని చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. శ్రియా రావ‌డంతో సినిమాథియేట‌ర్ వ‌ద్ద సంద‌డి నెల‌కొంది. శ్రియాతో సెల్ఫీల కోసం జ‌నం ఎగ‌బ‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement