Friday, April 26, 2024

జెంటిల్మెన్ కి సీక్వెల్ – హీరో తెలియ‌దు గాని హీరోయిన్స్ ఓకే

కొన్ని సినిమాలు ప్రేక్ష‌కులకి ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. అలాంటి చిత్రాల్లో ఒక‌టి జెంటిల్మెన్ కూడా. ఈ చిత్రం 199
3లో వ‌చ్చింది. కాగా ఈ మూవీలో యాక్ష‌న్ కింగ్ అర్జున్, మ‌ధుబాల జంట‌గా న‌టించారు. అప్ప‌ట్లో హిట్ కొట్టిందీ సినిమా. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది.. 2020లో ప్రముఖ నిర్మాత కేటీ కుంజుమోన్ బ్లాక్ బస్టర్ వెంచర్ “జెంటిల్మెన్”కి సీక్వెల్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చిత్రంలో కథానాయికలు వీళ్ళే అంటూ పలు రూమర్లు విన్పించాయి.వాటన్నింటికీ చెక్ పెడుతూ నిర్మాత కుంజుమోన్ కొన్ని రోజుల క్రితం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోందని అధికారికంగా అనౌన్స్ చేశారు. మరో హీరోయిన్ ను కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పిన నిర్మాత నేడు ఆ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. మరో హీరోయిన్‌గా ప్రియాలాల్ నటించనుందని వెల్లడించారు. అయితే హీరో ఎవరనే విషయం ఇంకా ఫైనల్ కాకపోవడం గమనార్హం. కాగా ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్న దర్శకుడు ఎవరన్న విషయాన్ని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement