Sunday, May 19, 2024

ఫ‌స్ట్ టైం డ‌బ్బింగ్ చెప్పిన – సీనియ‌ర్ న‌టి న‌దియా

ఫ‌స్ట్ టైం డ‌బ్బింగ్ చెప్పింది సీనియ‌ర్ న‌టి న‌దియా. అంటే సుంద‌రానికి చిత్రంలో న‌టిస్తోంది న‌దియా. దాంతో ఈ చిత్రానికి ఆమె స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. ఈ చిత్రంలో హీరోగా నాని న‌టిస్తున్నాడు. ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెల్సిందే. తాజాగా సినిమా నుండి విడుదల అయిన మొదటి సింగిల్ అంచనాలు మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు.ఇక ఈ సినిమాలో అత్తారింటికి దారేది ఫేమ్ నదియా కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె ఈమద్య కాలంలో చేసిన ప్రతి సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఈ సినిమాలో కూడా కథలో అత్యంత కీలకమైన పాత్రను ఆమెతో దర్శకుడు వివేక్ ఆత్రేయ చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవలే ఆమె పార్ట్ షూటింగ్ ను ముగించారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement