Wednesday, May 8, 2024

Breaking : సీఎం జ‌గ‌న్ ల‌క్ష్యాల‌ను నెర‌వేరుస్తా – మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

సీఎం జ‌గ‌న్ లక్ష్యాల‌ను నెర‌వేరుస్తామ‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు.నేడు రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు ధర్మాన ప్రసాదరావు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రెవెన్యూ అని కాకుండా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బావుండేదని అన్నారు.. సీనియర్ అధికారులతో కలిసి ఒక టీంగా పని చేయడం నా అలవాట‌ని చెప్పారు.. అనేక చట్టాల వల్ల చాలా భూములు వివాదాల్లో చిక్కుకుంటాయి.. దీని వల్ల ప్రభుత్వానికి.. ఆయా వ్యక్తులకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయని.. దీన్ని దృష్టిలో పెట్టుకునే భూములను ఫ్రీ హోల్డులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు సర్వే చేస్తున్నామని.. ఈ ప్రక్రియ వల్ల పెద్ద ఎత్తున నిధులు మార్కెట్లోకి వస్తాయన్నారు. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు త‌న విధుల‌ని నిర్వ‌ర్తిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement