Sunday, May 19, 2024

Rajasthan : రాంగ్ యు ట‌ర్న్…ఆరుగురు మృతి

రాజస్థాన్‌లోని ఢిల్లీ – ముంబై ఎక్స్ ప్రెస్ వే పై నేడు జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ట్రక్ రాంగ్ యూటర్న్ తీసుకుంటుండగా.. దాని వెనుకే ఉన్న కారు ట్రక్కును ఢీ కొట్టింది. ప్రమాదంలో మరణించినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

ఈ ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. సవాయి మాధోపూర్ జిల్లాలోని బనాస్ నది వంతెన సమీపంలో జరిగిన ప్రమాదం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో ట్రక్ డ్రైవర్ దే తప్పని స్పష్టంగా తెలుస్తోంది. ట్రక్కు, దాని వెనుక కారు వెళ్తుండగా.. ట్రక్కు అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంది. వేగంగా వెళ్తున్న కారు.. యూటర్న్ తీసుకుంటున్న ట్రక్కును ఢీ కొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకునేలోపే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement