Monday, April 29, 2024

Sai Pallavi | హేతియమ్మన్ ఉత్సవాల్లో సాయి పల్లవి.. ప్రత్యేక దుస్తుల్లో అలరించిన బ్యూటిఫుల్​ లేడీ

తమిళనాడులోని నీలగిరిలో హేతియమ్మన్​ మాత ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు వేలాది మంది తరలివస్తుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి పూజల్లో పాల్గొంటారు. అయితే.. సినీ నటి సాయి పల్లవి ఈ మధ్య కాలంలో బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉంటున్నారు. కాగా, ఇవ్వాల హేతియమ్మన్​ ఉత్సవాల్లో ప్రత్యేకమైన సంప్రదాయ వస్త్రధారణలో సాయి పల్లవి కనిపించి సందడి చేశారు. మొన్నటికి మొన్న ఏపీలోని పుట్టపర్తికి వచ్చి సత్యసాయి టెంపుల్​లో కనిపించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్కు పెట్టుకున్నా అభిమానులు గుర్తించి ఫొటోలు తీశారు.

ఇక.. హేతియమ్మన్ ఉత్సవాల్లో నీలగిరి జిల్లాలో నివసించే పాదుఖర్ ప్రజలు హేతియమ్మన్‌ను తమ వంశ దైవంగా పూజిస్తారు. దేవత హేతియమ్మన్ అసలు స్థలం కోటగిరి సమీపంలోని పేరకణిలో ఉంది. ఇది మాత్రమే కాదు, పదుఖర్ ప్రజలు నివసించే అనేక గ్రామాల్లో హేతియమ్మన్ ఆలయాలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి నిర్వహించే హేతియమ్మన్ ఉత్సవాలు ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటి సాయి పల్లవి సంప్రదాయ హేతియమ్మన్ వేషధారణలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పడుకరిన మహిళలు సంప్రదాయబద్ధంగా తెల్లటి దుస్తులు ధరించి, వెండి ఆభరణాలు వంటి సంప్రదాయ ఆభరణాలతో అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా, సాయిపల్లవి కూడా ఈ వస్త్రధారణలో హేతియమ్మన్ ని తన బంధువులతో కేటపలో ఉత్సవంలో పాల్గొన్నారు. హేతియమ్మన్ అవతారంలో సినీ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సాయి పల్లవిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. సాయి పల్లవి అదే గెటప్‌లో బంధువులతో సెల్ఫీలు, ఫోటోషూట్‌లలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement