Friday, April 26, 2024

మున్సిపల్‌ ఏఈ పరీక్ష వాయిదా.. అదేరోజు గేట్‌ పరీక్ష ఉండడంతో రీషెడ్యూల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్‌ ఏఈ(అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌) పోస్టులకు నిర్వహించే పరీక్షను వాయిదా వేస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం అదే తేదీన దేశవ్యాప్తంగా గేట్‌-2023 పరీక్ష జరగనుంది.

ఈక్రమంలో ఏఈ పరీక్షను కూడా అదే రోజు నిర్వహిస్తే గేట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఆ అవకాశాన్ని కోల్పోతారని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. ఈనేపథ్యంలో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని ఈమేరకు నిర్ణయించింది. ఫిబ్రవరి 12వ తేదీన జరగాల్సిన పరీక్షను మార్చి 5న నిర్వహించనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement