Saturday, April 27, 2024

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. సాయి ధరం తేజ్ డిశ్చార్జ్ ఎప్పుడంటే..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ క్రమంగా కోరుకుంటున్నారు.
సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్‌-ఐకియా మార్గంలో బైక్‌పై వేగంగా వెళుతున్న క్రమంలో బైక్ స్కిడ్ అయి సాయి ధరమ్ గాయపడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు. దాదాపు పది రోజులు వెంటిలేటర్‌పై ఉన్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్‌ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది.
సాయిధరమ్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని, ఇప్పుడు సొంతంగా శ్వాస తీసుకుంటున్నట్టుకూడా పేర్కొన్నారు. రెండు మూడురోజులలో సాయిధరమ్ డిశ్చార్జ్ కానున్నట్టు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement