Friday, May 3, 2024

సెప్టెంబర్ 24న బైడెన్, మోడీ సమావేశం..

భారత ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 24న జో బైడెన్‌, నరేంద్రమోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ ప్రకటించింది. ఐతే… ప్రధాని మోదీ ఈ వారంలో అమెరికా వెళ్లనున్నారు. జో బైడెన్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాక.. మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి. వీరు గతంలో వర్చువల్ ద్వారా జరిగిన… క్వాడ్ సమ్మిట్ , క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7 సమావేశాల్లో పాల్గొన్నారు. కాగా.. జో బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత… ప్రధాని మోడీ అమెరికా పర్యటన వెళ్లడం ఇదే మొదటి సారి.

ఇది కూడా చదవండి: వాణిజ్య ఉత్సవంను ప్రారంభించిన సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement