Thursday, April 25, 2024

వాణిజ్య ఉత్సవంను ప్రారంభించిన సీఎం జగన్

వాణిజ్య ఉత్సవం 2021ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ప్రారంభించారు. విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్లో  రెండు రోజుల పాటు వాణిజ్య ఉత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా  నిర్వహించనుంది. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవం జరుగనుంది. వాణిజ్య ఉత్సవం 2021కు దేశ విదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి లక్ష్యంగా  ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే వాణిజ్య ఉత్సవంలో పారిశ్రామిక ప్రగతిపై  పలు సెమినార్లను ప్రభుత్వం నిర్వహించనుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement