Sunday, May 12, 2024

Russia Ukraine War : కీవ్ లో టీవీ టవర్ ధ్వంసం.. ఐదుగురు దుర్మరణం

ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం సరిహద్దులోకి దూసుకొచ్చిన రష్యా బలగాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. రష్యా వైమానిక దాడులతో కీవ్ నగరంలోని ప్రధాన టీవీ టవర్ ధ్వంసమైంది. ఈ దాడిలో ఐదురుగు మృతి చెందారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్ నడిబొడ్డున ఉన్న ప్రధాన టెలివిజన్ టవర్‌పై రష్యా దళాలు దాడి చేసినట్టు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది. ఈ దాడి వల్ల టవర్ సిగ్నల్‌కు అంతరాయం కలిగిందని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటోన్ హెరాష్చెంకో తెలిపారు. కాగా, రష్యా బలగాను దీటుగా ఉక్రెయిన్ సైన్యం కూడా వీరోచితంగా పోరాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement