Sunday, May 19, 2024

ఇబ్ర‌హీంప‌ట్నం కాల్పుల ఘ‌ట‌న‌లో ద‌ర్యాప్తు వేగ‌వంతం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండ‌లంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న‌ కాల్పుల ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెందిన విష‌యం విదిత‌మే. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈకేసు చేధించేందుకు ఎస్వోటి, ఐటీ సెల్, సీసీఎస్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ పోలీసులు బృందాలుగా ఏర్పాటయ్యారు. శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్‌తో పాటు, పక్క పొలానికి చెందిన మట్టారెడ్డి, మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెషనల్ షూటర్లు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రెక్కీ నిర్వహించి మరీ శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై కాల్పులు జరిపి హత్య చేసినట్లు భావిస్తున్నారు. సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించి ఉండొచ్చనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొబైల్ సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement