ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దళాలు విరుచుకుపడ్డాయి. యుద్ధ ట్యాంకర్లు నగరాన్ని చుట్టుముట్టగా, గెరిల్లా దళాలతో రష్యా ఆర్మీ దాడులు నిర్వహించాయి. మూడున్నర నెలల తర్వాత మరోసారి కీవ్ లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
కొత్త వార్ జనరల్ బాధ్యతలు తీసుకున్న గంటల్లోనే కీవ్ పై భకర దాడులు చేస్తున్నారు. కీవ్ లక్ష్యంగా వందల సంఖ్యలో మిస్సైళ్ల ప్రయోగం చేస్తున్నారు. మూడు అపార్ట్ మెంట్లను ధ్వంసం చేశారు. మిస్సైల్ దాడుల్లో అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆఫీస్ ధ్వంసమైనట్లు ప్రచారం జరుగుతోంది. క్రిమియా బ్రిడ్జి ధ్వంసంతో పుతిన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.