Tuesday, May 7, 2024

Munugode Bypoll : బీజేపీ భారీ ర్యాలీ… కాసేపట్లో నామినేషన్ వేయనున్న రాజగోపాల్ రెడ్డి

నల్గొండ : మునుగోడు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి చండూరు మండలం బంగారిగడ్డ నుండి చండూరుకు భారీ ర్యాలీతో కుటుంబ సభ్యులతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బయలుదేరారు. ర్యాలీలో రాజ్ గోపాల్ రెడ్డితో పాటు మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకట స్వామి, హుజురబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర నేత గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, స్టీరింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఊరు వాడ, పల్లె పట్నం అనే తేడా లేకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ వెంట ర్యాలీగాఅభిమానులు కార్యకర్తలు బ‌య‌లుదేరారు. భారీ జన సంద్రోహం నడుమ రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్ వేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement