Wednesday, May 8, 2024

బ‌ద్ద‌ల‌యిన పైప్ లైన్.. ప‌గిలిన రోడ్డు

పైప్ లైన్ ఒక్క‌సారిగా బ‌ద్ధ‌ల‌వ్వ‌డంతో రోడ్డు కూడా ప‌గిలి నీరు బ‌లంగా పైకి ఎగ‌జిమ్మింది. పైప్‌లైన్ బద్దలైన వేగానికి పైన రోడ్డు ముక్కలైంది. అదే సమయంలో అటు నుంచి స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ ఆ భారీ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయి గాయపడింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను ఫోన్‌లో మాట్లాడుతున్నానని, ఆ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయిందని ప్రత్యక్ష సాక్షి పూజా బిశ్వాస్ తెలిపారు. నీటి ప్రవాహంలో చిక్కుకుని గాయపడిన మహిళను స్థానికులు రక్షించారు.ఈ సంఘ‌ట‌న మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా విదర్భ హౌసింగ్ సొసైటీలో జరిగిందీ ఈ ఘటన.

Advertisement

తాజా వార్తలు

Advertisement