Friday, April 26, 2024

Breaking: ఆదిలాబాద్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీ, వ్యాన్​, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమం

మంచిర్యాల – బెల్లంపల్లి జాతీయ రహదారిపై ఇవ్వాల రాత్రి (బుధవారం) లారీ, ఐచర్ వ్యాను, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వారిని హాస్పిటల్​కు తరలించగా పరిస్థితి సీరియస్​గానే ఉందని డాక్టర్లు తెలిపారు. బొక్కలగుట్ట రాళ్లవాగు వంతెన కే.కే. ఫైర్ వర్క్స్ దాటాక మంచిర్యాల నుండి బెల్లంపల్లి వైపు శనగల లోడుతో వెళుతున్న లారీ, మందమర్రి నుండి మంచిర్యాల వైపు వస్తున్న వ్యాను ఎదురెదురుగా ఢీకొన్నాయి.

కాగా, మందమర్రి నుండి వస్తున్న కారు వ్యానును వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాను డ్రైవరు, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరి పరిస్థితి సీరియస్​గా ఉన్నట్టు తెలుస్తోంది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. క్షత్తగాత్రులను అంబులెన్సులో మంచిర్యాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు రామకృష్ణాపూర్ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement