Saturday, April 27, 2024

సెప్టెంబర్ చివరి నాటికి పిల్లలకు వ్యాక్సిన్లు

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో కొవిడ్​-19 వ్యాక్సిన్​ బూస్టర్​ డోసు కూడా వేసుకోవాల్సిన‌ అవసరం రావ‌చ్చ‌ని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్​దీప్ గులేరియా తెలిపారు. పిల్లలకు కరోనా టీకాపై భారత్​ బయోటెక్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్​ నాటికి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులపై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు. 2 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ కొనసాగుతున్నాయని వివరించారు. సెప్టెంబరు చివరి నాటికి భార‌త్‌లో చిన్నారులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంద‌ని ర‌ణ్‌దీప్ గులేరియా అన్నారు. జైడస్‌ క్యాడిలా తయారు చేసిన టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయ్యాయి. టీకా వినియోగ అనుమతి కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుందని చెప్పారు.

ఇది కూడా చదవండిః తెలుగు రాష్ట్రాల్లో పోటెత్తిన వరద.. ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తివేత!

Advertisement

తాజా వార్తలు

Advertisement