Saturday, April 27, 2024

రైల్వేశాఖ కొత్త ఆలోచ‌న – డోర్ టు డెలివ‌రీ

కొరియ‌ర్ కంపెనీలు, ఈ కామ‌ర్స్ డెలివ‌రీ మాదిరిగా వ్య‌క్తులు, వ్యాపార‌సంస్థ‌ల‌కు ఇంటి వ‌ద్ద‌కే డెలివ‌రీ సేవల‌ను అందించ‌నుంది రైల్వేశాఖ‌. పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను పరీక్షిస్తోంది. ఇండియా పోస్ట్ తోను భాగస్వామ్యం కుదుర్చుకోనుందట‌. తద్వారా సరుకు రవాణా వ్యాపారాన్ని విస్తరించుకునే ఆలోచనతో ఉంది. ఢిల్లీ ఎన్ సీఆర్, గుజరాత్ లోని సనంద్ సెక్టార్ లో ఈ ఏడాది జూన్-జూలై నాటికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనేది రైల్వే శాఖ ప్రణాళిక. వైట్ గూడ్స్ (ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు), చిన్న వస్తువుల రవాణాను లక్ష్యం పెట్టుకున్నాం’’ అని డెడికేెటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ (డీఎఫ్ సీసీ) అధికారి ఒకరు తెలిపారు. సంస్థ ఎంపిక చేసిన పాయింట్ల వద్ద డెలివరీ చేయాల్సి వస్తువులను అందించడం లేదంటే ఇల్లు, కార్యాలయాల నుంచి పికప్ చేసుకునే ఆప్షన్ ఇవ్వనున్నట్టు డీఎఫ్ సీసీ తెలిపింది. కస్టమర్లు కోరితే రవాణా చేయాల్సిన వస్తువులకు ప్యాకింగ్ చేసే బాధ్యతను కూడా రైల్వే తీసుకోనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement